మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
గుమ్మడివాని పాలెం నుంచి 264వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
17 Sep 2018 9:47 AM
విశాఖపట్నం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం వైయస్ జగన్.. భీమిలి నియోజకవర్గంలోని గుమ్మడివాని పాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి నీలకుండీల జంక్షన్, మిందివాని పాలెం, గుడిలోవ జంక్షన్ మీదుగా తర్లువాడ క్రాస్ వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. అక్కడ వైయస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అనంతరం ఎల్వీ పాలెం మీదుగా ఆనందపురం జంక్షన్ వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం ఆనందపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు.