262వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

 
విశాఖపట్నం : వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 262వ రోజు పాద‌యాత్ర వైయ‌స్ జగన్‌ విశాఖ ఈస్ట్‌ నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రామకృష్ణా పురం, శ్రీకృష్ణ పురం, ఫైనాపిల్‌ కాలనీ, దరపాలెం వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది.   భోజన విరామం అనంత‌రం తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. లంచ్‌ క్యాంప్‌ నుంచి దరపాలెం, అడవివరం, లండ గరువు క్రాస్‌ మీదుగా దువ్వపాలెం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది.  


తాజా వీడియోలు

Back to Top