వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
గోపాలపట్నం నుంచి 258వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
09 Sep 2018 9:22 AM
విశాఖపట్నం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. 258వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం వైయస్ జగన్ విశాఖటపట్నం నియోజకవర్గంలోని గోపాలపట్నం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి గోపులపట్నం జంక్షన్, బాజీ జంక్షన్, ఎన్ఏడీ జంక్షన్ మీదుగా ఓల్డు కరాస వరకు పాదయాత్ర సాగనుంది. వైయస్ జగన్ రాకతో పాదయాత్ర సాగే మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ఓల్డు కరాసకు చేరుకున్న తర్వాత భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నాం 2.45 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. మర్రిపాలెం మీదుగా పశ్చిమ విశాఖ, ఉత్తర విశాఖపట్నం మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం పశ్చిమ విశాఖపట్నం నియోజకవర్గంలోకి ప్రవేశించిన తర్వాత కంచరపాలెంలో జరిగే బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.