అన్నవరం శివారు నుంచి 252వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

విశాఖ‌:   దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి నివాళులర్పించిన అనంతరం జననేత వైయ‌స్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి 252వ రోజు ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించారు. అన్నవరం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి చోడవరం నియోజకవర్గం రేవళ్లు, ఖండేపల్లి క్రాస్‌, లక్కవరం క్రాస్‌, గవరవరం,జి.జగన్నాథపురం మీదుగా మడుగుల నియోజక వర్గం వేచలం క్రాస్‌, ములకలపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది.  వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.
 

Back to Top