తుమ్మలపాల నుంచి 250వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 విశాఖ: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 250వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం అనకాపల్లి నియోజకవర్గంలోని తుమ్మలపాల శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి మర్టురు క్రాస్‌, బవులవాడ క్రాస్‌, త్రిముర్తుల నగర్‌  మీదుగా ధర్జీనగర్‌ వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగనుంది. వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. ప్రజలు తమ సమస్యలను జననేతకు విన్నవించుకుంటున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. 

Back to Top