దార్ల‌పూడి నుంచి 243వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 విశాఖ : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 243వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం దార్లపూడి నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి యలమంచిలి నియోజకవర్గంలోని ఏటికొప్పాక, పద్మనాభరాజుపేట, పులపర్తి మీదుగా పురుషోత్తమపురం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.  వైయ‌స్‌ జగన్‌ను కలవడానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, పార్టీనేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి రాజన్న తనయుడికి ఘనస్వాగతం లభించింది. 

 


తాజా వీడియోలు

Back to Top