207వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 207వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం వైయస్‌ జగన్‌ బస చేసే ప్రాంతం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రామచంద్రాపురం నియోజకవర్గంలోని చిన్నతళ్ల పొలం,  పెదతల్లి పొలము వరకు సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం వెళ్ల క్రాస్‌ మీదుగా రామచంద్రాపురం చేరుకుంటారు. సాయంత్రం రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
 
Back to Top