రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
తాగేందుకు నీళ్లివ్వండి చాలు...కొల్లేరు ప్రాంత మహిళలు
13 May 2018 3:35 PM
తమకు మంచినీళ్లు కావాలని, ఉప్పునీళ్లు తాగలేక, ఖరీదైన నీటిని కొనలేక
నానాపాట్లు పడుతున్నామని కొల్లేరు మహిళలు వాపోయారు. దూరం నుంచి నీళ్లు తెచ్చుకునే
పరిస్థితి లేదని, అందుబాటులో ఉన్న ఈ నీళ్లు తాగితే రోగాలు వచ్చేస్తున్నాయంటూ వాపోయారు.
స్థానికంగా లభిస్తున్న రంగు మారిన నీటిని బ్యాటిళ్లలో నింపి తెచ్చి జననేతకు
చూపించారు. కైకలూరు నుంచి పైపులేస్తే చాలు తమ ప్రాంతానికి మంచినీరు సరఫరా అయి
కనీసం తాగేందుకు నీళ్లు వస్తాయని వివరించారు. వీరి సమస్యలను విన్న వైయస్ జగన్
మోహన్ రెడ్డి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానంటూ వారిలో భరోసా నింపారు. కొల్లేరు
వాసుల సమస్యలు విన్న వాటిని పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు