వైయస్‌ఆర్‌ స్ఫూర్తిగా ముందుకు వెళ్దాం

విజయవాడ: వైయస్‌ జగన్‌ విజయవాడలో అడుగుపెడుతుంటే..వారధి సైతం కదిలిందని, రాజధాని మొత్తం కదిలిందన్నారు. కృష్ణమ్మ సాక్షిగా మన నాయకుడు మన కోసం ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని చెప్పారు. హోదా కోసం మన ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణదీక్ష చేస్తుంటే..టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి ప్రజల వద్దకు రావాలని సవాల్‌ విసిరారు. టీడీపీ మునిగిపోయే పార్టీ కాబట్టే అది గమనించిన యలమంచిలి రవి మన పార్టీలోకి చేరారన్నారు. తప్పకుండా వైయస్‌ జగన్‌కు మనమందరం మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. మహానేత స్ఫూర్తితో అందరం ముందుకు Ðð ళ్దామని పిలుపునిచ్చారు.
 
Back to Top