తిప్పేలపల్లి వద్ద వైయస్ జగన్‌ను కలిసిన నిరుద్యోగులు





ధర్మవరం:

గడ చిన నాలుగేళ్ల కాలంలో ఉపాథి అవకాశాలు లేక, నానా అవస్థలు పడుతున్నామని పలువురు నిరుద్యోగులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం నాడు తిప్పేల పల్లి వద్ద వారు జననేతను కలుసును తమ గోడును వెలిబుచ్చుకున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని మరచిపోయారని ప్రభుత్వ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్  వారికి భరోసా ఇస్తూ, ప్రత్యేక హోదాతో ఉపాథి అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు. హోదా సాధనకు జరిగే పోరాటంలో తాము కూడా అండగా ఉంటామని ఈసందర్భంగా నిరుద్యోగులు ప్రకటించారు.

Back to Top