ప్రజాసంకల్ప యాత్రకు నేడు విరామం

 


 - రేపు యధావిధిగా పాదయాత్ర

 విశాఖపట్నం:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు బుధవారం విరామం ప్రకటించారు. బక్రీద్‌ పర్వదినం సందర్భంగా యాత్రకు విరామం ప్రకటించినట్టు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రొగ్రామ్స్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ తలశిల రఘురాం ప్రకటించారు. ముస్లిం సోదరులు బక్రీద్‌ పండుగను నిర్వహించుకునేందుకు వీలుగా పాదయాత్రకు విరామం ప్రకటించినట్టు ఆయన  తెలిపారు. పాదయాత్ర గురువారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. బక్రీద్‌ పండుగను జరుపుకుంటున్న తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 

Back to Top