జననేతను కలిసిన సగర సంఘం సభ్యులు

దెందులూరు : అధికారంలోకి వచ్చిన తరువాత సగరులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని, రాజకీయంగా వారికి ప్రాతినిధ్యం కల్పించడానికి
ప్రయత్నిస్తామని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజా
సంకల్పయాత్ర చేస్తున్న ఆయనను సగర (ఉప్పర)సంఘం ప్రతినిధులు కలుసుకుని తమ సమస్యలపై
వినతిపత్రం సమర్పిచారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో తమ కులాన్ని బిసి-డి
నుంచి బిసి-ఎ కు మారుస్తానంటూ హామీ ఇచ్చి మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

Back to Top