బాధలు పంచుకుంటున్న రాజుపాలెం ప్రజలు

గోపాలపురం
నియోజకవర్గం రాజుపాలెం గ్రామంలో ప్రజా సంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. స్థానికంగా
అధికంగా ఉన్న డయాలిసిస్ వ్యాధి గ్రస్తులు జననేత వైయస్ జగన్ ను కలుసుకుని తమ
సమస్యలను విన్నవించుకున్నారు. ఇదే ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న
పసిపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులనేక మంది తమ ఆవేదనను పంచుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం
వల్ల తమకు వైద్య సేవలు అందని వైనాన్ని వారు వివరించారు. వారందరికీ భరోసా ఇస్తూ
ఆదుకుంటానంటూ హామీ ఇస్తూ...అధికారంలోకి వస్తే ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్య
సదుపాయాలు ఆందిస్తామని వైయస్ జగన్  చెప్పారు. 

Back to Top