వైయస్‌ జగన్‌ 11వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌


హైదరాబాద్‌: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 11వ రోజు కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తారు. ఉదయం 8 గంటలకు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని దొర్నిపాడు మండలంలో పాదయాత్ర ప్రారంభమవుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్‌ తెలిపారు. 9.30 గంటలకు బనగానపల్లె నియోజకవర్గంలోని కంపమల్ల మెట్టకు జననేత చేరుకుంటారు. 10.30 గంటలకు ఉయ్యలవాడ క్రాస్‌రోడ్డు, 11.30 గంటలకు భీమునిపాడు గ్రామాల వరకు పాదయాత్ర చేస్తారు. 12.30 గంటలకు భోజన విరామం. తిరిగి 3.30 గంటలకు కోవెలకుంట్ల మండలంలోని పేర బిల్డింగ్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 4.30 గంటలకు కోవెలకుంట్ల, 5.30 గంటలకు కోవెలకుంట్ల బస్టాండ్‌ సెంటర్‌కు వైయస్‌ జగన్‌ చేరుకుంటారు. 6.30 గంటలకు క్రర సుబ్బారెడ్డి విగ్రహం సెంటర్‌కు చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు 11వ రోజు పాదయాత్ర ముగుస్తోంది. ఆయనకు స్వాగత ఆహ్వానం పలికేందుకు పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. 


 

తాజా వీడియోలు

Back to Top