సైదాపురం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

నెల్లూరు :  వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  75వ రోజు మంగళవారం ఉదయం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం శివారు నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి సిద్ధయ్య కోన, పొక్కనదాల క్రాస్‌ మీదుగా ఊటకూరు, గిద్దలూరు క్రాస్‌, తురిమెళ్ల కు పాదయాత్ర చేరుకుంటుంది. దారిపోడవునా ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతారు. తురిమెళ్లలో ఆయన వైయ‌స్ఆర్‌  సీపీ జెండాను ఆవిష్కరిస్తారు.  అక్కడి నుంచి కలిచేడుకు ఆయన చేరుకుంటారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో వైయ‌స్ జ‌గ‌న్‌ ముఖాముఖి ఉంటుంది. కలిచేడులోనే ఆయన రాత్రి బస చేస్తారు.
Back to Top