64వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 64వ రోజు షెడూఃల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. బుధవారం ఉదయం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పాyì రేడు గ్రామం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి తార్నినేరి గిరిజన కాలనీ, లక్ష్మమ్మ కండ్రిగ, టీసీ అగ్రహారం, ఆర్‌వీ కండ్రిగ వరకు సాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం ఉంటుంది. తిరిగి 3 గంటలకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పునః ప్రారంభమవుతుంది. పెనుమళ్లం, పాపానాయుడిపేట, మ్రరిమంద బీసీ కాలనీ, వికృతమాల గ్రామ వరకు సాగుతుంది. సాయంత్రం 5.30 గంటలకు 64వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.
 
Back to Top