49వ రోజా ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


చిత్తూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన జనవరి 1, 2018కి 49వ రోజుకు చేరుకుంటుంది. ఈ మేరకు 1వ తేదీ పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురామ్‌ విడుదల చేశారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు వైయస్‌ జగన్‌ చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ముదివేడు గ్రామం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 9.30 గంటలకు కడప క్రాస్‌ రోడ్డు, 10.30 గంటలకు నడింపల్లి గ్రామం, 11.30 గంటలకు గడ్డేత్తువారిపల్లె, 11.45 గంటలకు మదనపల్లి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. 12.15 గంటలకు అడ్డంగిటివారిపల్లె, చిలకవారిపల్లె చేరుకుంటారు. 1.30 గంటలకు భోజన విరామం ఉంటుంది. 3 గంటలకు తిరిగి పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. చిలకలవారిపల్లె, రేగంటివారిపల్లె, సీటీఎం క్రాస్‌రోడ్డు వరకు పాదయాత్ర సాగుతుంది.
 

తాజా వీడియోలు

Back to Top