మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
29 Nov 2017 10:03 AM
కర్నూలు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 21వ రోజు ప్రారంభమైంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో బుధవారం పాదయాత్ర కొనసాగుతోంది. అక్కడి నుంచి ఐ.కొండ క్రాస్ రోడ్డు చేరుకుంటారు. ఈ యాత్రలో వైయస్ జగన్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఉదయం 10 గంటలకు గంజిహల్లికి చేరుకుంటారు. అక్కడ నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం వైయస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. విరామం తర్వాత మద్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. 03.30గంటలకు బైలుప్పలకు చేరుకుంటారు. అనంతరం 4.30గంటలకు బి అగ్రహారం వద్ద పార్టీ జెండా ఎగరవేసి ప్రసంగిస్తారు. ఆ తర్వాత పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం 6గంటలకు వైయస్ జగన్ బసచేస్తారు.