<br/>కర్నూలు: వైయస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 20వ రోజు పాదయాత్ర ఇవాళ ఉదయం ప్రారంభమైంది. ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పుట్టపాశం నుంచి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలుపెట్టారు. అక్కడ నుంచి హెచ్ కైరవడి, గాజులదిన్నె క్రాస్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభం అవుతుంది. గోనెగొండ్లలో పార్టీ జెండా ఆవిష్కరించి, బహిరంగ సభ నిర్వహిస్తారు. రాత్రికి వైయస్ జగన్ గోనెగండ్లలోనే బస చేస్తారు.<br/><br/>