60వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శుక్రవారంకు 60వ రోజుకు చేరుకుంటుంది. ఈ మేరకు 60వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు చంద్రగిరి నియోజకవర్గంలోని కొత్తవేపకుప్పం గ్రామం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి పాతవేపకుప్పం, నెట్టకుప్పం, తిమ్మరాజుపల్లి, గొల్లపల్లి, సీ. కలేపల్లి వరకు సాగుతుంది. 12 గంటలకు భోజన విరామం ఉంటుంది. 3 గంటలకు తిరిగి వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.15 గంటలకు చిటతూరు, హరిజనవాడ, 4.45 గంటలకు రాయల చెరువు, 5.45 గంటలకు కుప్పం బాదురు గ్రామాల వరకు సాగుతుంది. 6.30 గంటలకు 60వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.
 
Back to Top