108వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్ర 108వ రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం ప్రకాశం జిలా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలంలోని బస ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి అంబెడ్కర్‌ నగర్, వేటపాలెం, దేశాయ్‌పేట, జండ్రపేట వరకు సాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం ఉంటుంది. అనంతరం 2.45 గంటలకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. రామకృష్ణాపురం, చీరాల వరకు సాగుతుంది. చీరాల పట్టణంలోని క్లాక్‌ టవర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారు.
 
Back to Top