కైకలూరులోకి ప్రవేశించిన పాదయాత్ర

జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం
నుంచి కైకలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ ఉదయం మల్లయ్య పాలెం క్రాస్ వద్ద
తన పాదయాత్రను ప్రారంభించిన
వైయస్ జగన్   చౌటపల్లి మీదుగా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం
పెదపాలపర్రు గ్రామంలోకి ప్రవేశించారు. తమ నియోజకవర్గంలోకి అడుగుడిన వైయస్ జగన్ కు
స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. యువత పెద్ద సంఖ్యలో ఎదురెగి ,
పాదయాత్రలో అడుగులో అడుగేస్తూ నడిచారు. జగన్ రాకతో ఈ గ్రామంలో పండుగ సందడి
నెలకొంది.

Back to Top