163 రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్

దెందులూరు : ప్రజా సమస్యలను తెలుసుకోడానికి ప్రతిపక్ష వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరిజిల్లాలో కొనసాగుతోంది. 163 రోజైన బుధవారం నాడు ఉదయం దెందులూరు మండలం జోగన్న పాలెం నుంచి ప్రారంభమై, అప్పారావు పాలెం క్రాస్, శ్రీరామవరం, భైగాని పేట, మేదినరావు పాలెం క్రాస్, రామారావు గూడెం వరకు సాగుతుంది. అటు తరువాత మధ్యాహ్నం చల్ల చింతలపూడి, పెరుగు గూడెంల వరకు జగన్ పాదయాత్ర చేస్తారు. పెరుగు గూడెం వద్ద పార్టీ పతాకావిష్కరణ చేస్తారు.

Back to Top