జననేతకు జన నీరాజనం

వేంపల్లి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ను ఆశీర్వదించేందుకు ప్రజలంతా  ప్రజా సంకల్పయాత్రకు  వేలాదిగా  తరలివస్తున్నారని ఎమ్మెల్యే అంజద్‌బాషా పేర్కొన్నారు.  ఎక్కడికక్కడ ప్రజలు జననేతకు నీరాజనం పలుకుతున్నారన్నారు. మహిళలంతా రోడ్ల మీదకు వచ్చి వైయస్‌ జగన్‌కు హారతులు ఇస్తున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాల ప్రజలు తమ సమస్యలు జననేతకు చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చడం లేదని వైయస్‌ జగన్‌కు చెబుతున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ న్యాయం చేస్తానని, సమస్యలు పరిష్కరిస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారని అంజాద్ బాష చెప్పారు. ఎస్సీల సమస్యలను తెలుసుకోవడం కోసం శ్రీనివాస కళ్యాణమండంలో రచ్చబండ కార్యక్రమం చేపట్టారన్నారు.

Back to Top