వైయస్‌ జగన్‌ను కలిసిన వికలాంగులు

కర్నూలు: ప్రభుత్వం వికలాంగులను పట్టించుకోవడం లేదని వికలాంగుల పోరాట సమితి సభ్యులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. బనగానపల్లె నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను వికలాంగులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వికలాంగులకు ఆర్టీసీ నుంచి ఉచిత బస్‌ పాస్‌ ఇవ్వాలని కోరారు. వికలాంగుల సమస్యలను పరిష్కరిస్తామని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్‌ శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కూడా జననేతను కలిసి వినతిపత్రం అందజేశారు.
 

తాజా వీడియోలు

Back to Top