వైయస్‌ జగన్‌ ముందుచూపున్న నాయకుడు

చిత్తూరు:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపున్న నాయకుడని తిరుపతి ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అందరి సమస్యలను వింటూ.. ప్రతి ఒక్కరిని ఆవేదనను జననేత అర్థం చేసుకుంటున్నారన్నారు. రైతులు, మహిళలు సహా అన్ని వర్గాల వారి సమస్యలు వైయస్‌ జగన్‌ పరిష్కరిస్తారన్నారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబుకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదన్నారు.

Back to Top