వైయస్‌ జగన్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం

అనంతపురం:  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామం వద్ద వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 36వ రోజు ప్రజా  సంకల్ప యాత్ర ప్రారంభానికి ముందుకు వేద పండితులు వైయస్‌ జగన్‌ పాదయాత్ర విజయవంతం కావాలని స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతా మంచి జరుగుతుందని వేద పండితులు జననేతను దీవించారు.
 

తాజా వీడియోలు

Back to Top