రైతు సంక్షేమాన్ని విస్మరించారు – ఎంవీఎస్‌ నాగిరెడ్డి

అనంతపురం:

రైతు సంక్షేమాన్ని టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని రైతు విభాగం రాష్ట్ర ప్రెసిడెంట్ ఎంవీఎస్‌ నాగిరెడ్డి మండిపడ్డారు. ఐదు లక్షల కుటుంబాలు పక్క రాష్ట్రాలకు వలస వెళ్లారని నాగిరెడ్డి తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మారాల గ్రామంలో రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగిరెడ్డి మాట్లాడుతూ మారాల గ్రామంలో కూడా ఒక్క విడత కూడా రుణమాఫీ అమలు కాలేదన్నారు. ఈ గ్రామంలోని 22 డ్వాక్రా సంఘాలకు రుణాలు మాఫీ కాలేదని తెలిపారు. ఈ గ్రామంలోని చెరువు విషయంలో దివంగత ముఖ్యమంత్రి రూ.90 లక్షలు ఖర్చు చేశారన్నారు. మహానేత అకాల మరణంతో పనులు ఆగిపోయాయని, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top