మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
మహానేతకు మంచిపేరు వస్తుందని అధికార పార్టీ కుట్రలు
23 Dec 2017 11:53 AM
అనంతపురం: మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి అయితే ఆయనకు మంచి పేరు వస్తుందని అధికార పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అనంతపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పలువురు రైతులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు వివరించారు. మహానేత మరణాంతరం హంద్రీనీవాను పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, చంద్రబాబులు మోసం చేశారని రైతులు విమర్శించారు. రెయిన్గన్ల పేరుతో రైతులను దగా చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని చంద్రబాబు గ్రహించి డబ్బులో గెలిచేందుకు అవినీతికి తెర లేపారని రైతులు ఆరోపించారు. నాడు చంద్రబాబు పాలనలో రైతాంగం దుర్భరంగా మారడంతో యస్ఆర్ హయాంలో రైతుల దర్జాగా బతికారన్నారు.