జన ప్రభంజనంలో బాబు కొట్టుకుపోవడం ఖాయం

విజయవాడ:  వైయస్‌ జగన్‌ రాకతో విజయవాడలో ఉప్పెన రేగిందని, ఈ ప్రభంజనంలో చంద్రబాబు కొట్టుకుపోతారని యలమంచిలి రవి హెచ్చరించారు. టీడీపీ నాయకుడు యలమంచిలి రవి వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. చిట్టినగర్‌ సభలో ఆయన మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తెచ్చేందుకు వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రంలో మేధావులు లేరా? సింగపూర్‌ నుంచి మేధావులు కావాలా అని ప్రశ్నించారు. మళ్లీ రాజన్న రాజ్యం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
 
Back to Top