పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
వైయస్ఆర్ కుటుంబానికి కృతజ్ఞుడిని
15 May 2018 12:34 PM
పశ్చిమగోదావరి: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తన కుటుంబానికి చేసిన మేలును శ్రీనివాసరావు మరువలేదు. తన కూతురును బతికించిన ఆ కుటుంబానికి ఎల్లవేళలా కృతజ్ఞుడిగా ఉంటానని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించడంతో వెంటనే తాళ్లూరి శ్రీనివాసరావు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏలూరు సత్రంపాడుకు చెందిన శ్రీనివాసరావు తన సైకిల్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో అలంకరించుకొని తన వంతు ప్రచారం నిర్వహిస్తుంటాడు. వైయస్ కుటుంబంతో ఏం లబ్ధి పొందావని అడిగితే.. నా కుమార్తె విజయకు కడుపులో కంతి రావడంతో విజయవాడలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేర్పించాను. లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వైద్యానికి మహానేత వైయస్ఆర్ పెట్టిన ఆరోగ్యశ్రీతో ఉచితంగా జరిగి తన బిడ్డ బతికిందని, అందుకే ఆ కుటుంబం అంటే అంత అభిమానం అని బదులిస్తున్నాడు.