72వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

నెల్లూరు :   వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 72వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం సంగటూరు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శనివారం పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చిల్లమాను చెన్నైక్రాస్‌, గుర్రంకొండ, అర్మేనుపాడు వరకూ సాగుతుంది. అక్కడ వైయ‌స్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ప్రజాసంకల్పయాత్ర గూడూరు మండలం కాండ్ర నుంచి పునఃప్రారంభం అవుతుంది. వెంకటేశుపల్లి, తిమ్మ సముద్రం క్రాస్‌ వరకూ ఆయన యాత్రను కొనసాగిస్తారు.
 

Back to Top