కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
బద్వేల్ సమస్యలన్నీ పరిష్కరిస్తా: వైయస్ జగన్
13 Nov 2017 1:29 PM
జొన్నవరం: బద్వేల్ నియోజకవర్గంలోని ప్రధానమైన మూడు సమస్యలను పరిష్కరిస్తానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో బద్వేల్ నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భం వారు మైలవరం నుంచి రాయలసీమకు థర్మల్ పవర్ ప్లాంట్కు నీరు, వంద కోట్లతో నియోజకవర్గ అభివృద్ధితో పాటు పలు సమస్యలపై వైయస్ జగన్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ.. కడప జిల్లాలో చివరి రోజు పాదయాత్రకు వచ్చిన బద్వేల్ నియోజకవర్గానికి చెందిన ప్రతి బూత్ కమిటీ కన్వీనర్లకు, సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు ఇంకా బాగా పనిచేయాలని సూచించారు. వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగిసిన తరువాత మళ్లీ బస్సు యాత్ర చేపడతానని, ఆ యాత్రలో ప్రతి అసెంబ్లీకి మూడు, నాలుగు మేజర్ సమస్యలపై అసెంబ్లీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. మన ప్రభుత్వం రాగానే అవి కచ్చితంగా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు.