వైయస్‌ జగన్‌ను కలిసిన ఆటోడ్రైవర్లు


కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను ఆటో డ్రైవర్లు కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. జరిమానాల పేరుతో అధికారులు వేధిస్తున్నారని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. వారంలో ఒకసారి ఆటోను పట్టుకున్నా రూ.8 వేలు జరిమానా విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోడ్రైవర్లకు అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.
 
Back to Top