ప్రారంభ‌మైన 95వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌


ఒంగోలు: ప‌్ర‌జా ప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 95వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ పెద్దఅల‌వ‌ల‌పాడు శివారు నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. అనంత‌రం రామాపురం, గుండేవారిపాలెం క్రాస్ మీదుగా హ‌జీస్ పురం వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు.  కాగా జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. దారి పొడ‌వున ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వింటూ వారికి భ‌రోసా నిస్తూ ముందుకు క‌దులుతున్నారు వైయ‌స్ జ‌గ‌న్‌.
Back to Top