66వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

 
చిత్తూరు: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 66వ రోజు షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని కుక్కలవారి కండ్రిగ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వెంకటాపురం క్రాస్, కుమ్మర మిట్ట, మోదుగు పాలేం క్రాస్, కొత్త వీరాపురం, అగ్రహారం, కంబాక, అంజిమీడు క్రాస్‌ వరకు సాగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం ఉంటుంది. 2.45 గంటలకు తిరిగి వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3 గంటలకు ఏర్పేడు, 4 గంటలకు మెర్లపాక క్రాస్, అక్కడి నుంచి హరిజన వాడ, 5 గంటలకు చిండేపల్లి వరకు పాదయాత్ర సాగుతోంది. 
 
Back to Top