31వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం


 అనంతపురం : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 31వ రోజు పాద‌యాత్ర ప్రారంభ‌మైంది.  ఆదివారం ఉదయం 8 గంటలకు శింగనమల నియోజకవర్గం మార్తాడు గ్రామం నుంచి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర మొద‌లుపెట్టారు. అక్కడి నుంచి కోటంక గ్రామానికి, 10.30 గంటలకు ఊర్వకొండ నియోజకవర్గం కోడేరు మండలం కమ్మూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం ఉంటుంది. 3 గంటలకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. 3.30 గంటలకు అరవకూరు, 4 గంటలకు కూడేరు గ్రామానికి చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు జ‌న‌నేత‌ 31వ రోజు పాదయాత్ర ముగుస్తుంది. 
Back to Top