ముగిసిన 29వ రోజు ప్రజాసంకల్పయాత్ర

అనంత‌పురం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 29వ రోజు పాద‌యాత్ర ముగిసింది. ఉద‌యం 8 గంటలకు సింగనమల నియోజకవర్గం సింగనమల మండలంలో వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారితో మమేకమై కల్లుమడి చేరుకొని వైయ‌స్ఆర్ సీపీ జెండా ఎగరవేశారు.  అక్క‌డి నుంచి 10.30 గంటలకు వైయ‌స్‌ జగన్‌ గుమ్మేపల్లి చేరుకున్నారు. ఈ గ్రామానికి చేరుకోవ‌డంతో 400 కిలోమీట‌ర్ల మైలు రాయిని వైయ‌స్ జ‌గ‌న్ దాటారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో వేప మొక్క‌ను నాటారు. పాద‌యాత్ర‌లో ఆయా గ్రామాల ప్ర‌జ‌లు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు. 

Back to Top