శంక‌వ‌రం నుంచి 231వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 తూర్పుగోదావరి  : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 231వ రోజు మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శంఖవరం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి శంఖవరం, శృంగవరం, బంగారయ్యపేట మీదుగా రౌతులపూడి వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. కాగా, వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగిస్తున్నారు. 
Back to Top