ప్రారంభమైన 155 రోజు పాదయాత్ర

 గుడివాడ:  వైయస్ ఆర్ కాంగ్రెస్  అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 155
వ రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు
నుంచి ప్రారంభమైంది. . స్థానికులు, పార్టీనేతలు, కార్యకర్తలు పెద్ద
ఎత్తున పాదయాత్రకు తరలివచ్చారు. జననేత తో తమ సమస్యలను విన్నవించుకుంటూ,
పరిష్కరించేందుకు చొరవ చూపాలని పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. పాదయాత్ర అంగలూరు, బొమ్మలూరు మీదుగా గుడివాడలోని నెహ్రూ చౌక్ సెంటర్ కు
చేరుకుంటుంది, సాయంత్రం అదే ప్రాంతంలో బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.

Back to Top