దావాజీగూడెం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 కృష్ణా జిల్లా : వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ కృష్ణా జిల్లా గన్నవరంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైయ‌స్‌ జగన్‌ 145వ రోజు పాద‌యాత్ర‌ను బుధవారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం దావాజీగూడెం శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఉంగటూరు మండలం వెన్నూతల, పుట్టగుంట క్రాస్‌ రోడ్డు, వెల్దిపాడు క్రాస్‌ రోడ్డు, నాగవరప్పాడు, ఎలకపాడు క్రాస్‌ రోడ్డు, ఉంగుటూరు, ఆముదాల పల్లి క్రాస్‌ రోడ్డు, లంకపల్లిల మీదుగా వెంకట రాంపురం వరకూ పాద్రయాత్ర కొనసాగనుంది. 

తాజా వీడియోలు

Back to Top