144వ ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


కృష్ణా జిల్లా: వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 144వ రోజు షెడ్యూల్‌ ఖారారైంది. మంగళవారం ఉదయం గన్నవరం నియోజకవర్గంలోని బస ప్రాంతం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 8 గంటలకు కొండపావులూరు, అక్కడి నుంచి పురుషోత్తం పట్నం, వెంకటనరసింహాపురం కాలనీ వరకు సాగుతోంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం గన్నవరం బొమ్మల సెంటర్, దావాజీ గూడెం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. గన్నవరం బొమ్మల సెంటర్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.
 
Back to Top