వైయ‌స్ఆర్ కాల‌నీ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 విజయవాడ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విజయవాడ ప్రజలు నీరాజనం పలుకుతున్నారు.   కనక దుర్గమ్మ సాక్షిగా తొలిరోజు విజయవంతంగా సాగిన పాదయాత్ర, రెండో రోజు ఆదివారం ఉదయం వైయ‌స్‌ఆర్‌ కాలనీ నుంచి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. అక్క‌డి నుంచి అంబాపురం, జక్కంపూడి మీదుగా కొత్తూరు తాడేపల్లి చేరుకుంటారు. అనంతరం లంచ్‌ విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కొత్తూరు, వెలగలేరు మీదుగా ముత్యాలంపాడు క్రాస్‌ చేరుకొని పాదయాత్ర ముగిస్తారు. వైయ‌స్ జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు 1765. 6 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. 

Back to Top