108 ఉద్యోగులకు వైయస్ జగన్ భరోసా

వైయస్ఆర్ జిల్లాలో ఐదవ రోజు వైయస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పోట్లదుర్తి సమీపంలో 108 ఉద్యోగులు వైయస్ జగన్ ను కలిశారు. తమ సమస్యలను చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో 108 ఉద్యోగులను పోలీసులు నిర్బంధించారంటూ వైయస్ జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. రోజుకు 12 గంటలు పనిచేస్తున్నా సకాలంలో జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వైయస్ఆర్ హయాంలో ఎంత సంతోషంగా ఉన్నారో అలాంటి పరిస్థితిని మళ్లీ కల్పిస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. పనికి తగ్గ వేతనంతో పాటు సకాలంలో జీతాలు చెల్లించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. మంచి రోజులు వస్తున్నాయి...తప్పకుండా మీ బతుకులు బాగుపడుతాయని 108 ఉద్యోగులకు వైయస్ జగన్ ధైర్యం చెప్పారు.

Back to Top