వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రజా సమస్యలపై వైయస్సార్సీపీ పోరాటం
19 Jun 2017 11:48 AM
తూర్పుగోదావరి జిల్లా: ప్రజా సమస్యలపై పోరాడేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ స్పష్టం చేశారు. ఐ. పోలవరం మండలం టీ.కొత్తపల్లి గ్రామంలో పితాని ఆధ్వర్యంలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి వచ్చిన పితాని బాలకృష్ణకు ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఓట్ల కోసం మమ్మల్ని నమ్మించి మోసం చేసిందని ప్రజలంతా వాపోయారు. అనంతరం పితాని మాట్లాడుతూ... త్వరలోనే మహానేత వైయస్ఆర్ పరిపాలన ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వస్తుందన్నారు. వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రజా సమస్యలన్ని శాశ్వతంగా పరిష్కారం అవుతాయని భరోసా కల్పించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు శ్రీనివాసరాజు, విజయ్కుమార్, శ్రీహరి, రామరాజు, శర్మ తదితరులు పాల్గొన్నారు.