మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బలవంతపు భూసేకరణపై ఆగ్రహం
01 Apr 2017 3:11 PM
తూర్పుగోదావరిః 216 జాతీయ రహదారి విస్తరణ కోసమని చెప్పి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటోందని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు మండిపడ్డారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా కన్నబాబు సర్పవరం ప్రాంతంలో పర్యటించారు. ప్రభుత్వం నిర్వాకం వల్ల వందలాది మంది రైతులు అన్యాయమైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బుక్ వాల్యూ ప్రకారం రెండున్నర రెట్లు ఇవ్వాలని చట్టం చెబుతున్నా కూడా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు . సర్పవరం ప్రాంతంలో ఎకరం రూ.కోటి పైన నడుస్తుంటే 9లక్షలు ఇస్తామంటూ కాగితాలు చేతిలో పెట్టి, డబ్బులు ఇవ్వకుండా అధికారపార్టీ నేతలు భూమిని స్వాధీనం చేసుకునే పని చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేం దారుణమని అడిగితే సమాధానం చెప్పే నాథుడే లేడన్నారు. కనీస పరిహారం ఇవ్వకుండా భూములు ఏవిధంగా స్వాధీనం చేసుకుంటారని బాధితులు అడుగుతున్నారని తెలిపారు. బాధితులకు వైయస్సార్సీపీ అన్ని విధాల అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.