రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఏ గడపకెళ్లినా సమస్యలే...!
12 Oct 2016 3:52 PM
ప్రత్తిపాడు: ఏ గడపకూ వెళ్లినా... ఏ మనిషిని పలకరించినా సమస్యలతో సతమతమవుతున్నారని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఆయన మండల పరిధిలోని రౌతుపాలెం గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలంతా చంద్రబాబు మోసపూరిత పాలనపై మండిపడుతున్నారన్నారు. ఏరు దాటే వరకు గట్టు మల్లన్న.... ఏరు దాటాకా బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు పాలన తీరు ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వంద ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ను ప్రజలకు అందజేసి బాబు పాలనపై మార్కులు వేయించారు.