అబద్ధపు హామీలతో కాలయాపన

కర్నూలు))

నంద్యాల నియోజకవర్గ ఇంచార్జ్ రాజగోపాల్ రెడ్డి పట్టణంలోని 4వ వార్డులో గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబు మోసపూరిత పాలనను ఇంటింటా ఎండగట్టారు. ఈసందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి, పక్కా ఇళ్లు ఇలా బాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కావడం లేదని..పథకాలన్నీ పచ్చచొక్కాలకే చేరుతున్నాయని పలువురు వాపోయారు. మాయమాటలతో మభ్యపెడుతూ మోసపూరిత పాలన సాగిస్తున్న బాబు సర్కార్ కు తగిన బుద్ధి చెప్పాలని రాజగోపాల్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.


Back to Top