రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
అడ్డగోలుగా పన్నులు పెంచుతున్నారు
17 Dec 2016 4:54 PM
నాయుడుపేట: నగర పంచాయతీ అధికారులు పన్నులు ఇష్టారీతిగా పెంచేస్తూ సమస్యలపై పట్టించుకోవడం లేదని మహిళలు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు మొరపెట్టుకున్నారు. పట్టణంలోని 9వ వార్డు పరిధిలోని అమరాగార్డెన్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ ఆధ్వర్యంలో ఎఎమ్మెల్యే సంజీవయ్య గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీ, ఇంటి స్థలాలు, పింఛన్లు తదితర సమస్యలపై బాధితులు వారి ఆవేదనను ఎమ్మెల్యే సంజీవయ్యకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.