ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
నిర్వాసితులకు తోడుగా ఉంటాం
11 Mar 2017 6:07 PM
శ్రీకాకుళం: హిరమండలం రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు అండగా ఉంటామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి అన్నారు. శనివారం హిర మండలం గర్లపాడు పంచాయతీలో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డిశాంతి రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ..వంశధార రిజర్వాయర్ నిర్వాసితులకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ప్యాకేజీ ఇవ్వాలన్నారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్ఆర్ ప్యాకేజీని విడుదల చేయకుండా, నిబంధనలు పాటించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు 5 సెంట్లు ఇల్లు స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాని డిమాండ్ చేశారు.